Pages

24/02/2014

రామచంద్రుడితడు

"రామచంద్రుడితడు  " అనేది అద్భుతమైన కీర్తన.
రాముని  చుట్టుతా ఉన్న పాత్రలకు రాముడు ఎంతటి విలువైన వాడు అని చెప్పడం ఎంతో బాగుంటుంది.

రాముడు కామిత ఫలదాత , ఇందరికీ అనటం ప్రత్యేకం , ఎందుకంటే ఆయన అనంత శక్తి మంతుడు అని చెప్పటం అన్నమయ్య ఉద్దేశం

గౌతము భార్య - అహల్య పాలిటి కామధేనువు ట శ్రీరాముడు. కల్పవృక్షం కామధేనువు చింతామణి కోర్కెలు తీర్చేవి అని general meaning చెప్పుకున్నా , ఇక్కడ ధేనువు అనటంలో "వాత్సల్యం" (అంటే దూడ మీద ఆవుకి ఉండే looking after mentality )   ని చెప్పటం అన్నమయ్య గొప్పదనం. పైగా కల్పవృక్షం నీ దగ్గరకి రాదు (అది చెట్టు గనుక) అదే కామధేనువు ఆవు కాబట్టి నీ దగ్గరికి వచ్చి నిన్ను అనుగ్రహిస్తుంది. అందుకని అహల్య పాలిటి కామధేనువు.  

కౌశికునికి అంటే విశ్వామిత్రునికి కల్పవృక్షము - విశ్వామిత్రుడు రాముని దగ్గరకి వెళ్ళాడు. whereas రాముడు తాను స్వయంగా అహల్య దగ్గరికి వెళ్ళాడు. కానీ కోర్కెలు ఇద్దరికీ తీరాయి. రాముడు అహల్య దగ్గర mobility and nobility చూబించాడు -వాత్సల్యం చూబించాడు దానికి కారణం ఆమె కదలలేని స్థితి.  

సీతాదేవికి చింతామణి ట. ఆమెకీ కోర్కెలు తీరాయి. కానీ మణి అనేది essentially అలంకారం. సీతమ్మవారు హనుమంతునికి తన చూడామణి ఇచ్చి రామునికిది ఇవ్వు అనిందిట సుందరకాండ లో. అంటే అది వారిద్దరి ప్రేమకీ వారు పెట్టుకున్న గుర్తు. అది "సీతాదేవికి చింతామణి" అంటే అర్ధం. రెండోది రాముడ్ని తనకి అలంకరించుకునేంత
చనువు ఎవరికి ఉంటుంది సీతమ్మ కీ తప్ప ?

so కోర్కెలు తీరడం common అయినా అందులోనూ differences ఉన్నాయి. చెట్టుని వెత్తుకుంటూ వెళ్ళిన వాడికి ఆ చెట్టు ఎపుడూ అక్కడే ఉంటుందని తెలుసు. అంటే he can revisit. రాముడు విశ్వామిత్రుని దృష్టిలో స్థిరుడు ఆయన పరమాత్మ కాబట్టి .(చెట్టుకి నగము/అగము అంటే కదలనిది అని పేరు ఉంది కదా). he can find Rama once again. he can revisit. - అది కల్పవృక్షం అంటే

కానీ నిన్ను చూడటానికి వచ్చిన ఆవు వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ పట్టుకోవాలంటే ఎంతో కష్టపడాలి.  it is a one-time affair, a glimpse merely. - అది కామధేనువు అంటే

ఇంక నా నగ / అలంకారం నా దగ్గరే ఉంటుంది. that is my own . exclusive.అది చింతామణి అంటే

రాముడు దాసుల పాలిట లోకంలోనూ మోక్షంలోనూ కూడా దేవుడే. అంటే పై మూడు చరణాల్లో కోర్కెలు తీర్చే సాధనాలు చెప్పాడు కదా అని కేవలం ఈ లోకమే అనుకోవద్దు ఆయన పూర్ణ పరబ్రహ్మ అని నొక్కి వక్కాణించాడు.

ఈ రెండో చరణం ఇంకా చిత్రం గా ఉంది.

పరసుగ్రీవు పాలి పరమబంధుడితడు - పాపం సుగ్రీవునికి బంధువులే లేరు. ఉన్న ఒక్క అన్న తనని తన్ని తగలేసాడు. ఆయనకి రాముడు పరమబంధుడయాడు. తానె మిత్రుడిలా పెద్ద అన్నలా మారి ఓదార్చాడు.

సరి హనుమంతుని పాలి సామ్రాజ్యము - హనుమంతుడు యోగి , విరాగి. ఆయనికేమి పట్టవు . అన్ని శక్తులున్నా అవేమి తెలియని వెర్రివానివలే ఉన్నాడు. ఆయనకి సామ్రాజ్యం లభించినంత గొప్ప లభించింది రాముడి వల్ల. "రామ భక్తి సామ్రాజ్యం ఏ మానవునకు అబ్బెనో మనసా" అని త్యాగరాజస్వామి అన్నది హనుమ గురించేకదా . హనుమకి రామభక్తి సామ్రాజ్యానికి పట్టాభిషేకం చేయటం కూడా కనిపిస్తుంది (అదొక పుణ్యతిథి) అదే ఇది.

నిరతి విభీషనుని పాలి నిధానము యితడు - పాపం విభీషణుడు పేద అయిపోయాడు. అన్న ఈతని బహిష్కరణ చేసాడు - తాను మహాభాగ్యవంతుడిని అనే అహంకారంతో. విభీషణునికి రావణుని దగ్గర ఉన్న నిధి మీద ఆశ లేదు పైగా అది పరధనం అని తెలుసు.  అలా వచ్చినవాడికి పెద్ద నిధి దొరికితే ? అది రామరక్ష అనే నిధి దాని వల్లనే ఆయన మళ్ళీ లంకా రాజ్యానికి రాజయ్యాడు కదా

నాల్గో పాదం పరమ చిత్రం .

గరిమ జనకు పాలి ఘనపారిజాతము -

అసలు సీతాకల్యాణంలో పరమ అదృష్టవంతుడు ఎవరయ్యా అంటే జనకుడే. ఆయన మహావిష్ణువని తెలిసినది ముగ్గురికే - వశిష్టుడు విశ్వామిత్రుడు జనకుడు (రాజర్షి) కాబట్టి. మిగిలిన ఇద్దరూ గురువులు కాబట్టి ఆయనకి నమస్కారాలు చేయలేరు (లోక మర్యాదకి భిన్నంగా ) ఆయనే విష్ణువని తెలిసినా. వారు కేవలం ఆశీర్వదించగలరు. మిగిలినవారికి తెలియనే తెలియదు. జనకుడికి పట్టిన అదృష్టం ఏమిటంటే ఆయన కన్యాదానం అప్పుడు రాముని పాదాలు కడిగాడు. అది రామునికి నమస్కరించినట్టే కదా. పెళ్లి అంతా అయ్యాక రాముడికి మావగారి హోదాలో ఆయనని ఆశీర్వదించాడు కదా . ఈ రెండూ ఇంకెవరికైనా దొరికాయా? కేవలం జనకుడికే ఆ అదృష్టం. పారిజాతం అంటే కూడా దేవతా వృక్షమే. కానీ శరణాగతపారిజాత అనే ప్రయోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ జనకుని విచిత్రమైన పరిస్థితికి, ఆయన చేసిన శరణాగతి కారణం అని అనిపిస్తుంది.

మరొక విచిత్రం - అసలు కోర్కెలే ఉడిగిపోయిన వాడు జనకుడు. వాళ్ళ వంశాన్ని దేశాన్ని కూడా "విదేహ" అంటారు. అంటే దేహ భ్రాంతి వదిలిపోయిన వారు అని. అటువంటివానికి కోరిక ఏమిటి అది తీర్చడం ఏమిటి? ఎంతటి యోగి అయినా ఏక కాలంలో అదే సందర్భంలో తాను నమస్కరించి తాను నమస్కారం అందుకునే అదృష్టం పడుతుందా ? అదే జనకుని కోరికేమో?

పైగా జనకుడు ఎక్కడా రాముడు దేవుడని బయటపడలేదు లోపల సంతోషించాడు తప్ప. ఇదే కదా వైరాగ్యం ఉంది అన్న వాడికి పరీక్ష . ఆ పరీక్షలో నెగ్గాడు జనకుడు అంటే అతనికి సాఫల్యం లభించినట్టే కదా.


తలప - ఆలోచించి చూడగా శబరికి ఇతను తత్వపు రహస్యమట !!! శబరికేమి రహస్యం తెలుసు కేవలం రామునికోసం ఎదురుచూడటం తప్ప? అదే రహస్యమేమో ? గురువు మాట మీద నమ్మకం తో ఓపికగా సాధన చెయ్యటమే తత్త్వ రహస్యం - అప్పుడు దేవుడు తనంత తానే ప్రత్యక్షమౌతాడు. ఇదే ఈ మాటకి అర్ధం అనుకోవచ్చు

అలరి గుహుని పాలి ఆది మూలము - అసలీ గుహుడు ఎవరు? అతను పడవ నడిపే వాడుకదా అతనికి రాముడెలా అంత మిత్రుడయ్యాడు?

విశ్వామిత్రుడు, జనకుడు వీరు బ్రహ్మర్షులు; అహల్య , శబరి తపస్సు చేసిన వారు; విభీషణుడు, సుగ్రీవుడు హనుమంతుడు కారణ జన్ములు భక్తులు; వీరికి రాముడు అందాడంటే అర్ధమయ్యాడంటే సరే . కానీ ఈ గుహుడు ఎవరు ? పడవనడిపే వాడికి రాజుగారి కొడుకు  అంటే భయం గౌరవం ఉంటాయి. పోనీ స్నేహం ఉండటానికి ఏమైనా అవకాశం ఉందా అంటే అదీ లేదు as far as i know (which is very little).

అది అతని సంస్కారం. అంతే. its inexplicable. ఆది మూలమైన జీవుని వేదన. ఇంత కంటే మరొక్కటి లేదు అనిపిస్తుంది.

కలడన్నవారిపాలి  కన్నులెదిటి మూరితి - అదేంటి ?ఇదింకా పరమాశ్చర్యం . కలడు అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవారికి , నమ్మి చెప్పేవారికి ఇంక కనులెదుట ఎందుకు ? అంటే కలడు అన్నవారు ప్రపంచమంతా విష్ణుమయంగా చూస్తారు కదా. (అలా చూడగల్గడమే కలడు అని నిజంగా అనగలగటం). అలాంటి వారికి (ప్రహ్లాదుడు కలడు కలడు అని పదే పదే చెప్పాడు) ఆయన సర్వత్రా కనిపిస్తాడు కదా . పైగా అటువంటి వారే అర్చావతారమైన వేంకటేశుని చూచి అక్కడ ఉన్నది శిల్పం కాదు దేవుడు అని చెప్పగలరు కదా. అది దీని అర్ధం.

అలా అనగలిగిన వారికోసం వెలసిన వెంకటాద్రి విభుడు ఈ రాముడు. అంటే ఈయన పురాణపురుషుడు అనుకోకండి. ఎదుటనే ఉన్నాడు అని చెప్పడం అన్నమయ్య ఉద్దేశం.


lyrics and audio link                                            


                  


           

No comments:

Post a Comment